© 2026 nimisham.in

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాల్లో సాగిన సూచీలు చివరికి అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి.
అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెంచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బాండ్ ఈల్డ్స్లో కదలికలు కూడా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగొచ్చనే అంచనాలకు బలం చేకూర్చాయి.సెన్సెక్స్ 417.49 పాయింట్లు నష్టపోయి 76,152.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 23,873.45 వద్ద ముగిసింది.నిఫ్టీకి 24,000 స్థాయి కీలకమైన అడ్డంకిగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దిగువన 23,800 స్థాయి తక్షణ కీలక మద్దతుగా ఉందన్నారు. ఈ స్థాయి కంటే నిఫ్టీ నిర్ణయాత్మకంగా దిగువకు వెళ్తే అమ్మకాలు మరింత పెరిగి 23,600 వరకు సూచీ పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.నిఫ్టీ షేర్లలో బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ట్రెంట్ ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 0.37 శాతం పెరగగా.. స్మాల్క్యాప్ సూచీ 1.2 శాతం లాభపడింది.రంగాల వారీగా చూస్తే రియల్టీ సూచీ అత్యధికంగా 2 శాతానికి పైగా పడిపోయింది. మీడియా, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్యూ బ్యాంక్, బ్యాంక్ సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ రంగాలు కూడా విస్తృత మార్కెట్తో పోలిస్తే వెనుకబడ్డాయి.మరోవైపు రూపాయి కాస్త కోలుకుంది. డాలర్తో పోలిస్తే రూ.94.48 వద్ద బలంగా నిలిచింది. డాలర్ లిక్విడిటీ మెరుగుపడటం దీనికి మద్దతుగా నిలిచింది. దాదాపు 127 బిలియన్ డాలర్ల ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లు రూపాయిపై ఒత్తిడిని తగ్గించే బఫర్గా పనిచేస్తున్నాయని నిపుణులు తెలిపారు. రూపాయి